మహాభారతం క్విజ్ # 3
1. మత్స్యగంధికి పరాశరుడు ఏమని వరమిచ్చాడు? - (ఆమె కన్యాత్వం వికలం కాదని వరమిచ్చాడు)
2. మత్స్యగంధి తన జన్మ గురించి ఏమని వివరించింది? - (తాను చేప కడుపున పుట్టినందున తన ఒంటి నిండ చేప వాసన ఉందని వివరించింది)
3. మత్స్యగంధి మీద మనసు పడిన పరాశరుడు ఏం చేశాడు? - (ఆమెను యోజన గంధిని చేశాడు. ఆమె శరీరం మీద నుంచి పరిమళాలు యోజనం వరకు వ్యాపించేలా వరం ఇచ్చాడు. నాటి నుంచి ఆమె యోజన గంధి అయింది)
4. యోజన గంధి అసలు పేరేమిటి? - (సత్యవతి)
5. సిగ్గుపడుతున్న సత్యవతిని చూసి పరాశరుడు ఏం చేశాడు? - (సత్యవతి వెలుగులో సిగ్గుపడుతుండటంతో, మంచుతెర కల్పించాడు. చీకటిని సృష్టించాడు)
6. సత్యవతిపరాశరులు ఎక్కడకు చేరుకున్నారు? - (కృష్ణద్వీపానికి)
0 comments:
Post a Comment