విదుర నీతులు
సంజయ రాయభారం పూర్తయింది. కుటిలచిత్తులకు భయం వెంటాడుతుంది. మనస్సు వికలత్వం పొందిన ధృతరాష్ట్రునికి భవిష్యత్ చెడుగా కన్పిస్తోంది. రాత్రి నిదురపట్టడం లేదు. ద్వారపాలకుని ద్వారా సర్వధర్మ మర్మజ్ఞుడు విదురుని రప్పించుకొని తన మనస్సుకు శాంతి కలిగించే మాటలు చెప్పమన్నాడు. ఆనాడు విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పిన మంచి మాటలే యీ విదురనీతులు. ఇవి ఆనాటి నుండి నేటి వరకూ అందరికీ శిరోధార్యములుగానే వర్తించుచున్నవి. వీటిని మనము ఆచరించుదాము .
ఓ ధృతరాష్ట్ర మహారాజా !
|
నిద్రరానివారు :
|
మంచిగుణాలున్నవారు ఎటువంటి కష్టాలనైనా సహనంతో భరిస్తారు. |
అసమర్థులు రాజ్యాన్ని పాలిస్తే శాంతికి భంగము కలుగుతుంది. (అరాచక శక్తులను అసమర్ధులు అణచలేరు) |
ఎన్నటికీ నష్టపోనివారు :
|
పండిత లక్షణములు :
|
పండితుడు దూరముగా ఉంచవలసినవి :
|
ప్రజలు ఎవరి నుండి సలహాలు ఎక్కువగా స్వీకరిస్తారోవారే పండితులు. |
అనవసర విషయాలు మాట్లాడవద్దు.(ఇది నేటి సమాజములో చాలా ఎక్కువగా వుంది) |
పోయినవాటి గురించి ఆలోచించవదు. (ఇలా శోకించడం వల్ల పోయినవి రావు కదా, ఉన్నవి కూడా పోయే అవకాశమున్నది) |
గొంతెమ్మ కోర్కెలు వద్దు. |
కష్టాలలో నిబ్బరంగా వుండు. |
సోమరిగా ఉండకు. |
పండితుడు గౌరవ, తిరస్కారములను ఒకేలా స్వీకరిస్తాడు. |
ఉపాయంలో అపాయాలు లేకుండా చూసుకొనేవాడు పండితుడు.(ఒక విషయాన్ని అన్ని కోణాల నుండి విశ్లేషించుకొని అప్పుడే ఆ పని చేస్తాడు పండితుడు. పండితుడంటే తెలివైనవాడుగా మనం గ్రహించాలి) |
ప్రారంభించిన పనిని మధ్యలో ఆపకు. |
ఒక పని చేయడానికి అది చిన్నదైనా పండితుడు నామోషీగా భావించడు. |
తెలివైనవాడి మాటకు తిరుగుండదు. |
గ్రంథములోని విషయాలను తెలివైనవాడు సులభముగా గ్రహించగలడు. |
0 comments:
Post a Comment