Pages

The Mahabharata Quiz - part 5

                                                          మహాభారత క్విజ్ # 5
1. భారతంలో ఎన్ని క్లిష్టమైన శ్లోకాలు ఉన్నాయి? - (8800 శ్లోకాలు అతి క్లిష్టంగా ఉంటాయి)

2. భారతాన్ని పూర్తి చేసినప్పటికీ వ్యాసమహర్షికి ఎందుకు సంతృప్తి కలగలేదు? - (రచన పూర్తి అయింది. మానవాళికి అందించవలసి ఉంది. అందుకు ప్రచారం అవసరం. అందుకని వ్యాసుడు నలుగురిని ప్రచారానికి నియమించారు)

3. వ్యాసుడు ఎవరెవరిని ప్రచారానికి వినియోగించారు? - (దేవలోకంలో నారద మహర్షిని, పితృలోకంలో అసితదేవలుని, గంధర్వలోకంలో శుకదేవుని, మానవ లోకంలో వైశంపాయనుడిని నియమించారు)

4. జనమేజయుడు ఏ యాగం చేశారు? -  (సర్పయాగం)

5. సర్పయాగం సందర్భంగా వైశంపాయనుడు ఏం చేశారు? - (మహాభారత కథను వినిపించారు)

6. భారత కథ చెబుతున్న సమయంలో  అక్కడ ఎవరు ఉన్నారు? - (ఉగ్రశ్రవుడు)

7. ఉగ్రశ్రవుడు ఎవరి కుమారుడు? - (రోమహర్షణుని కుమారుడు)

8. మహాభారత ప్రాశస్త్యాన్ని ఏమని వివరించారు? - (సర్వప్రాణులకు వర్జన్యుడు జీవనప్రదాత. ఈ మహాభారత వృక్షం అటువంటిదే. కవులు రచించే ముఖ్య రచనలకు ఈ మహాభారతం వర్జన్యుని లాగ ఆధారభూతం అవుతుంది)

9. మహాభారతం గురించి ఇంకా ఏమని ప్రశంసించారు? - (ఈ పురాణం పూర్ణచంద్రుని వంటిది. వేదాల వెన్నెలలు విరజిమ్ముతుంది. మనిషిలో మనోహరమైన వెన్నెలలను విరబూయిస్తుంది అని ప్రశంసించారు)

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు