1. పరీక్షిత్తు ఎవరి మనుమడు?(అర్జునుడు)
2. పరీక్షిత్తు ఎవరి కుమారుడు?(ఉత్తర అభిమన్యుల కుమారుడు)
3. ఎవరి తరవాత పరీక్షిత్తు రాజయ్యాడు?(పాండవుల తరువాత)
4. పరీక్షిత్తుకు దేని మీద మక్కువ ఎక్కువ?(వేట మీద)
5. పరీక్షిత్తు దేనిని వేటాడాడు అది ఎక్కడకు పరుగు తీసింది ? (మృగాన్ని, శమీక ముని ఆశ్రమంలోకి)
6. శమీకుడు ఎటువంటివాడు?(శాంత స్వభావుడు, ఒక చెట్టు కింద మౌనంగా తపస్సు చేసుకుంటున్నాడు )
7. పరీక్షిత్తు మృగం కోసం ఆశ్రమానికి వచ్చి ఏం చేశాడు? (తన మృగం కోసం మునిని అడిగాడు. ముని మౌనంగా ఉన్నాడు. దానితో పరీక్షిత్తుకి కోపం వచ్చి అక్కడ చచ్చి పడి ఉన్న పాముని శమీక ముని మెడలో వేసి, తన రాజధాని చేరుకున్నాడు)
8. శమీకుని కుమారుడు ఎవరు? (శృంగి. అతడు యోగి. బ్రహ్మ గురించి తపస్సు చేస్తున్నాడు)
9. శృంగి వద్దకు ఎవరు వచ్చారు? ( క్రుశుడు అనే ముని)
10. జరిగినది తెలుసుకున్న శృంగి ఏం చేశాడు?(దోసిటలోకి నీరు తీసుకుని, తన తండ్రిని అవమానిం చిన వాడు నేటికి ఏడవ నాడు తక్షక సర్పదష్టుడై మరణి స్తాడు' అని శపించాడు.)
0 comments:
Post a Comment