భాస్కర శతకము పద్యాలు - గిట్టుట కేడఁ గట్టడ లిఖించును
గిట్టుట కేడఁ గట్టడ లిఖించును నచ్చటఁగాని యొండుచోఁ
బుట్టదు చావు జానువులపున్కల నూడిచి కాశిఁ జావఁ గా
లట్టిన శూద్రకున్ భ్రమల గప్పుచుఁ దద్విధి గుఱ్ఱమౌచు నా
పట్టునఁ గొంచు మర్రికడఁ బ్రాణము తీసెందగయ్య భాస్కరా
తాత్పర్యం: శూద్రక మహారాజు తానెక్కడకునూ పోకుండ కాశిపురమందే మృతినొందదలచి, తన మోకాటి చిప్పల నూడదీయిచుకొని, నచ్చటనే యుండవలెనని నిశ్చయము చేసికొనగా, నా రాజునకు దైవమొక గుఱ్ఱమై వచ్చి ఆ సమయమున నాతనినొక మర్రిచెట్టు కడకు గొనిపోయి అచట వాని ప్రాణమును పోగొట్టెను. కావున, దైవ విధానమునకు భ్రమసేయుట కెంత యత్నించినను సఫలముకాదని యెఱుంగవలెను. తనకు చావు ఒక దగ్గఱ లిఖింపబడి యుండగా వేరొకచోట నెవ్వడును చావడు.
0 comments:
Post a Comment