భాస్కర శతకము పద్యాలు - క్రూరమనస్కులౌ పతులం
క్రూరమనస్కులౌ పతులం గొల్పి వసించిన మంచివారికిన్
వారిగుణంబె పట్టి చెడువర్తన వాటిలు మాధురీజలో
దారలు గౌతమీముఖమహానదులంబుధిఁ గూడినంతనే
క్షారముఁజెందవే మొదలి కట్టడ లన్నియుఁ దప్పి భాస్కరా
తాత్పర్యం: తియ్యని నీరు గలిగిన గోదావరి గంగ మొదలగు ప్రవాహములన్నియు సముద్రమునంబడి యుప్పఁబడి చెడినట్లు దుర్గుణుఁడగు ప్రభువు యొక్క సాంగత్యమువల్ల యోగ్యులును చెడిపోయి క్రూరులగుదురు.
0 comments:
Post a Comment