అభ్యుదయ కవిత్వం - Telugu General Knowledge
1. అఖిల భారత అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభ ఎప్పుడు, ఎక్కడ జరిగింది?
జవాబు: 1986 ఏప్రిల్ 9 లక్నోలో
2. అభ్యుదయమనే పదానికి సమానార్థకమైన ఆంగ్లపదం?
జవాబు: ప్రోగ్రెస్
3. వచన కవితకు ఆద్యుడు ?
జవాబు: శిష్టా
4. భారతీయ అభ్యుదయ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు: 1935 అలహాబాద్ లో
5. భావకవిత్వంపై తిరుగుబాటుగా వచ్చిన ఉద్యమం?
జవాబు: అభ్యుదయ కవిత్యోద్యమం
6. ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు: 1943లో
7. 'తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది' అని అన్నది ?
జవాబు: గజ్జెల మల్లారెడ్డి
8. మహాప్రస్థానం ఎవరికి అంకితమిచ్చారు?
జవాబు: కొంపల్లి జనార్దనరావు
9. 'అభ్యుదయం' అనే పదానికి గల అర్థం?
జవాబు: మంగళం, శుభం, ప్రగతి శీలం
10. ఆంధ్ర అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభకు అధ్యక్షులు ?
జవాబు: తాపీ ధర్మారావు
11. 'వచ్చాను వచ్చాను వ్యాస సంతితివాణ్ణి' అని అన్నది?
జవాబు: అనిసెట్టి సుబ్బారావు
12. 'నవమి చిలుక, విష్ణు ధనువు' అనేవి ఎవరి రచనలు ?
జవాబు: శిష్టా
13. మహాప్రస్థానానికి పీఠికగా యోగ్యతా పత్రం రాసింది ఎవరు?
జవాబు: చలం
14. 'విషాద భారతం' రచించింది ?
జవాబు: సి. విజయలక్ష్మి
15. 'రుధిర జ్యోతి' అనే కవితా సంపుటి ఎవరిది ?
జవాబు: శ్రీరంగం నారాయణబాబు
16. 'ఫీడేలు రాగాల డజను' అనే గేయసంపుటి ?
జవాబు: పఠాభి
17. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటి ఎప్పుడు వెలువడింది ?
జవాబు: 1950
18. 'నా వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను' అని అన్నది ఎవరు?
జవాబు: పఠాభి
19. 'ప్రపంచం ఒక లంకా నగరం బ్రతుకొక అశోక వృక్షం' అని అన్నదెవరు ?
జవాబు: బెల్లంకొండ రామదాసు
20. 'ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు' అని అన్నది ?
జవాబు: సోమసుందర్
21. నయాగరా కవులు?
జవాబు: . కుందుర్తి, ఏల్చూరి, బెల్లంకొండ
22. 'జయభేరి' ఎవరి రచన?
జవాబు : శ్రీశ్రీ
23. 'కుందుర్తి ఆంజనేయులు' బిరుదు ?
జవాబు: వచన కవితా పితామహుడు
24. 'వజ్రాయుధం' ఎవరి రచన?
జవాబు: సోమసుందర్
25. 'చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.....' అని అన్నది ?
జవాబు: వేములపల్లి శ్రీకృష్ణ
26. అభ్యుదయ కవిత్యోద్యమ ఆవిర్భావానికి ముందే అభ్యుదయ దృక్పథంతో రచనలు చేసిందెవరు?
జవాబు: శిష్టా ఉమామహేశ్వరరావు, పఠాభి, శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణ బాబు
27. 'పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి' అని అన్నది?
జవాబు : శ్రీశ్రీ
28. శ్రీశ్రీ ఏ రచన అభ్యుదయ కవిత్వానికి మేనిఫెస్టో వంటిది?
జవాబు: ప్రతిజ్ఞ
29. 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి...'అన్న శ్రీశ్రీ రచన ?
జవాబు: జయభేరి
30. అభ్యుదయ యుగంలో అచ్చయిన తొలి కావ్యం?
జవాబు: నయాగారా(1944లో)
31. శ్రీశ్రీ 'మహాప్రస్థానం' మొదట ఏ పత్రికలో ప్రచురితమైంది?
జవాబు: జ్వా ల
32. 'భగవంతుడికి బహిరంగ లేఖ' అనే కవితా ఖండిక ఎవరిది ?
జవాబు: కుందుర్తి ఆంజనేయులు
33. 'అరుణరేఖలు' రాసింది ?
జవాబు: తెన్నేటి సూరి
34. గెరిలా వీరులనుద్దేశించి 'ఇక్కడ కావు ముళ్లు తీసేది నడువు కామ్రేడ్ అని అన్నది ?
జవాబు: గంగినేని వెంకటేశ్వరరావు
35. 'శ్మశానం' ఎవరి రచన?
జవాబు: బెల్లంకొండ రామదాసు
36. అనిసెట్టి రచించిన ప్రముఖ అభ్యుదయ కావ్యం ?
జవాబు: అగ్నివీణ
37. 'ఉదయిని' అనే కావ్యం ఎవరిది?
జవాబు: గంగినేని వెంకటేశ్వరరావు
38. 'శంఖారావం ' రచన ఎవరిది?
జవాబు: గజ్జెల మల్లారెడ్డి
39. రెంటాల గోపాలకృష్ణ రచించిన అభ్యుదయ కావ్యాలు?
జవాబు: సంఘర్షణ, సర్పయాగం
0 comments:
Post a Comment